అక్టోబర్ 23న వయనాడ్​లో ప్రియాంక నామినేషన్

అక్టోబర్ 23న వయనాడ్​లో ప్రియాంక నామినేషన్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్​సభ ఉప ఎన్నికకు బుధవారం(ఈ నెల 23న) నామినేషన్ వేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు పేర్కొన్నాయి. సోమవారం ఢిల్లీలో ఖర్గేతో ప్రియాంక సమావేశమై ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

 వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక ఇండియా కుటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 11 గంటలకు రాహుల్, ప్రియాంక కలసి వయనాడ్​లో రోడ్‌ షో నిర్వహించనున్నారు. మధ్యా హ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించా యి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పలువురు జాతీ య నేతలు హాజరవుతారని సమా చారం. వయనాడ్​ఎంపీ స్థానానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరగ నుంది. 23న రిజల్ట్ వెల్లడికానుంది.