ఏపీకి 25, తెలంగాణకు రూ.20 లక్షలు విరాళం ఇచ్చిన నిర్మాత అశ్వినీదత్

ఏపీకి 25, తెలంగాణకు రూ.20 లక్షలు విరాళం ఇచ్చిన నిర్మాత అశ్వినీదత్

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (Aswani Dutt) తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం ప్రకటించారు. రెండ్రోజుల క్రితం (సెప్టెంబర్ 2న) ఏపీకి రూ.25 లక్షల విరాళం అందజేయగా..తాజాగా బుధవారం (సెప్టెంబర్ 4న) తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20 లక్షలు విరాళం ఇస్తున్నట్లు తెలిపారు.

అయితే, ఏపీకి ఇచ్చిన విరాళంతో పోలిస్తే తెలంగాణకు ఓ రూ.5లక్షలు తక్కువచేసి ఇవ్వడం గమనార్హం. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా కలిసి వరద బాధితులకు సాయం అందిస్తుండటంతో ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

ALSO READ | టార్గెట్ ప్రభాస్ ఎందుకు.. : వరద సాయం ప్రకటించకుండానే తప్పుడు రాతలు