ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల విరాళం అందజేసిన సుప్రియ యార్లగడ్డ

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల విరాళం అందజేసిన సుప్రియ యార్లగడ్డ

రెండు తెలుగు రాష్ట్రాలను హఠాత్తు వరదలు కుదేలు చేశాయి. దీంతో వరద భాదితులను ఆదుకునేందుకు సినీ సెలెబ్రెటీలు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు  ముఖ్యమంత్రి సహాయనిధికి తమకి తోచినంత సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో పాటూ మరింతమంది ముందుకువచ్చి విరాళాలు ప్రకటించారు. 

కాగా తాజాగా ప్రముఖ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ ముఖ్యమంత్రి సహాయ నిధికి అన్నపూర్ణ స్టూడియోస్ తరపున వరద బాధితుల సహాయార్థం రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. కాగా ఈరోజు(సెప్టెంబర్ 10, 2024) తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని కలసి 50 లక్షలు చెక్కు  అందజేశారు. దీంతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సుప్రియ యార్లగడ్డని అభినందించారు.

ALSO READ | AP/TG Floods: మానవత్వం చాటుకొన్న హీరో శింబు..కోలీవుడ్ నుంచి విరాళం ఇచ్చిన మొదటి హీరో