హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ వి.రాంచంద్రం నియమితులయ్యారు. వీసీ ప్రొ.కె.ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్గా రాంచంద్రంను నియమిస్తూ అడ్మినిస్ట్రేషన్ ఏఆర్సీహెచ్ప్రణయ్కుమార్శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నిరోజులు రిజిస్ట్రార్గా కొనసాగిన ప్రొ.పి.మల్లారెడ్డి పదవీకాలం ముగియగా, ప్రొ.వి.రాంచంద్రానికి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఎస్డీఎల్సీఈ డైరెక్టర్గా, సైకాలజీ హెచ్వోడీగా, కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్గా, యూనివర్సిటీ విద్యాకళాశాల ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు.
దాదాపు 33 ఏండ్ల బోధనా, పరిశోధన అనుభవం కలిగిన ప్రొ.రాంచంద్రం నేతృత్వంలో ఆరుగురు రీసెర్చ్స్కాలర్లు డాక్టరేట్ పొందగా, నలుగురు ఎంఫిల్ పట్టా పొందారు. 47కు పైగా సెమినార్ లు, కాన్ఫరెన్స్ లకు హాజరయ్యారు. కాగా, నూతన రిజిస్ట్రార్గా శుక్రవారం ప్రొ.వి.రాంచంద్రం బాధ్యతలు స్వీకరించగా, పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. 48 ఏండ్ల యూనివర్సిటీ చరిత్రలో రిజిస్ర్టార్ పదవిని అధిష్టించిన తొలిదళితుడిగా ప్రొ.రామచంద్రం పేరుకెక్కింది.