
- ప్రొఫెసర్ హరగోపాల్
ఖైరతాబాద్, వెలుగు: ఓయూ క్యాంపస్లో ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రొఫెసర్హరగోపాల్ డిమాండ్చేశారు. ‘ ఉద్యమాల ఉనికి పట్టు.. ఉస్మానియాపై ఉక్కుపాదమా?’ అనే అంశంపై శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ప్రొఫెసర్ హరగోపాల్పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల హక్కులను హరించవద్దని కోరారు. వీసీ స్పందించి సర్క్యులర్వెనక్కి తీసుకోవాలన్నారు. నందిని సిధారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, శ్రీనివాస్, అల్లం నారాయణ, కవ్వాల లక్ష్మారెడ్డి, వేణు, పరిటాల విష్ణువర్థన్రావు పాల్గొని మాట్లాడారు.