
పంజాగుట్ట, వెలుగు: విద్యకు రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం, కేంద్ర బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం అఖిల భారత విద్యాహక్కు వేదిక, విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భగత్ సింగ్మేనల్లుడు ప్రొఫెసర్జగ్మోహన్సింగ్, ప్రొ. చక్రధరరావు , ప్రొ. హరగోపాల్, ప్రొ. లక్ష్మినారాయణ కలిసి మాట్లాడారు.
అందరికీ విద్య కల్పించడమే సోషల్ జస్టిస్ అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్య ప్రాధాన్యాన్ని గుర్తించి బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి, రాష్ట్రాల హక్కులను కాలరాసే యూజీసీ రెగ్యులేషన్ను వ్యతిరేకించాలన్నారు.