కూసుమంచి, వెలుగు : పాలేరు పార్కును శుక్రవారం ఖమ్మం అడిషనల్కలెక్టర్ శ్రీజ, డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా టూరిజం శాఖ అధికారి సుమన్చక్రవర్తి సందర్శించారు. పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పార్క్కు మంత్రి పొంగులేటి చొరవతో రూ.5 కోట్లు మంజూరు కాగా, గతంలో పార్కులో కాటేజీలు, జెట్టీ నిర్మాణం, రెస్టారెంట్, విశ్రాంతిగది, సమాచార కేంద్రం, టిక్కెట్ కౌంటర్, పౌంటేన్లు, నిర్మించాలనే ప్రతిపాదనలు చేశారు.
వాటితో ఉపయోగమా? లేదా అనే కోణంలో అధికారులు పరిశీలించారు. గతంలో ఖమ్మం రూరల్ మండలంలో చింతపల్లికి నైజీరియా కొంగలు వచ్చేవి, వాటిని పాలేరు జలాశయానికి వచ్చే ఏర్పాట్లు చేసేలా కొత్త ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. తహాసీల్దారు కరుణశ్రీ పాల్గొన్నారు.