
- రాష్ర్ట ఉర్దు అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్
వర్ని, వెలుగు : రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ర్ట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మహాత్మాగాంధీ, అంబేద్కర్ ఫొటోలతో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తాహెర్బిన్మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీలో కేంద్రం వాటా ఉందని గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్తోనే సుస్థిర పాలన సాధ్యమన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తోట అరుణ్, బోధన్ మాజీ ఎంపీపీ గంగా శంకర్, మాజీ సింగిల్విండో చైర్మన్ పత్తి రాము, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు తోట సంగయ్య తదితరులు పాల్గొన్నారు.