
ఎడపల్లి, వెలుగు : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై ఎంపీ అరవింద్ కామెంట్లకు నిరసనగా గురువారం ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో అర్వింద్ దిష్టి బొమ్మను దహనం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించి, మాట్లాడారు.
జవహర్ నవోదయ పాఠశాల ఏర్పాటు అంశం పై అరవింద్ సుదర్శన్ రెడ్డి ని తీవ్రంగా విమర్శించాడని , ఎంపీ అరవింద్ బోధన్ కు కూడా ఎంపీగా వున్న విషయం మర్చి పోయి మాట్లాడుతున్నాడని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈరంటి లింగం, జైతాపూర్ సొసైటీ చైర్మన్ నారాయణ, నాయకులు ఎల్లయ్య యాదవ్, సంజీవ్, స్వామి గౌడ్, బంజకామప్ప, కిషోర్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.