భద్రాచలంలో మృతదేహంతో టూరిజం హోటల్​ ఎదుట ధర్నా

భద్రాచలంలో మృతదేహంతో టూరిజం హోటల్​ ఎదుట ధర్నా

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని టూరిజం హోటల్​లో గత పదేళ్లుగా పనిచేస్తున్న నర్సింహారావు అనే కార్మికుడు బుధవారం గుండెపోటుతో మరణించారు. అకారణంగా హోటల్ మేనేజర్​ నర్సింహారావును మూడు నెలల కింద విధుల నుంచి తొలగించారని, దీంతో మనోవేదనకు గురైన అతడు గుండెపోటుతో చనిపోయారని ఆరోపిస్తూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.