
నర్సంపేట, వెలుగు : మిడ్డే మీల్స్ పెట్టాలని డిమాండ్చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీ స్టూడెంట్లు ఖాళీ ప్లేట్లతో మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ బొట్ల నరేశ్మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మిడ్డే మీల్స్ఏర్పాటు చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చే స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయకపోవడం వల్ల పస్తులు ఉండే పరిస్థితి నెలకొందన్నారు. నిరసనలో ప్రశాంత్, వినయ్కుమార్, రామకృష్ణ, ప్రసాద్, రమ్య, రవళి, కావ్య ఉన్నారు.