
ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు కదం తొక్కారు. జోరు వాన లెక్క చేయకుండా శంషాబాద్ మండల కార్యాలయం వద్ద ఆందోళన కు దిగారు. వారు మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల్లో తమ డిపార్ట్మెంట్ వారిని ఆయా ప్రభుత్వాలు పర్మినెంట్ చేయగా బీఆర్ఎస్ మాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్టు వ్యవస్థే ఉండకూడదని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. చాలి చాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకోస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు.