
కోల్బెల్ట్, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని మూసివేందుకు యాజమాన్యం చేస్తున్న కుట్రలకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో బొగ్గు గనులపై నిరసన చేపట్టారు. కాసిపేట1, 2, శాంతిఖని గనితో పాటు డిపార్ట్మెంట్లపై నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాకు దిగారు. యాజమాన్యం నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆయా గనుల మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు. బెల్లంపల్లితోపాటు పరిసర సింగరేణి ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న ఏరియా ఆస్పత్రిని మూసివేస్తే ఊరుకోబోమని లీడర్లు హెచ్చరించారు. ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్అలీ, మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచీల సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, సెక్రటరీ వెంకటస్వామి, తిరుపతి గౌడ్, పిట్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.