తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అందిస్తున్నాం : సరోజా వివేక్

తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అందిస్తున్నాం : సరోజా వివేక్

ముషీరాబాద్, వెలుగు: పేద, మధ్య తరగతి స్టూడెంట్లకు అతి తక్కువ ఫీజుతో ఉన్నతమైన విద్యను అందిస్తున్నామని అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్ కరస్పాండెంట్ సరోజా వివేక్ తెలిపారు. స్టూడెంట్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, వారి ఎదుగుదలకు అంబేద్కర్​కాలేజీ పునాది అని చెప్పారు. మంగళవారం బాగ్ లింగంపల్లి లోని కాలేజీలో స్టూడెంట్లకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్​నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.లక్ష్మారెడ్డి, సరోజా వివేక్, అంబేద్కర్​ఇనిస్టిట్యూషన్స్​జాయింట్ సెక్రటరీ రమణ కుమార్ పాల్గొని మాట్లాడారు. కాలేజీలో అనేక స్కిల్​డెవలప్​మెంట్​ప్రోగ్రామ్స్​నిర్వహిస్తున్నారని, స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాలేజీలోని సౌకర్యాలు, యాజమాన్యం విధివిధానాలపై స్టూడెంట్లు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఓరియంటేషన్​ప్రోగ్రామం చక్కటి వేదిక అన్నారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూషన్స్​డైరెక్టర్లు, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు.