టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : దామోదర్​రెడ్డి

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : దామోదర్​రెడ్డి
  • పీఆర్టీయూ స్టేట్​ జనరల్ సెక్రెటరీ దామోదర్​రెడ్డి

కామారెడ్డి​​, వెలుగు : టీచర్ల సమస్యల పరిష్కారానికి   కృషి చేస్తానని పీఆర్టీయూ స్టేట్​ జనరల్​ సెక్రటరీ పుల్గం దామోదర్​రెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన దామోదర్​రెడ్డి పీఆర్టీయూ స్టేట్​ జనరల్​ సెక్రటరీగా ఎన్నకవడంతో అభినందన సభ, పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి పరిచయ సభ ఆదివారం కామారెడ్డిలోని ఈఎస్​ఆర్​ గార్డెన్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్​రెడ్డి మాట్లాడుతూ... టీచర్లకు సేవ చేసుకునేందుకు స్టేట్​ బాధ్యతలు వచ్చాయన్నారు.

కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్​గా 8 ఏండ్లు అవకాశం ఇచ్చారన్నారు. స్టేట్​ జనరల్ సెక్రెటరీగా తనను గెలిపించేందుకు జిల్లాకు చెందిన సభ్యులంతా శ్రమించారన్నారు. అందరికీ తాను రుణపడి ఉంటానన్నారు. కరీంనగర్​ నియోజక వర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి వంగ మోహన్​రెడ్డి పోటీ చేస్తున్నారని ఆయన గెలుపు కోసం ప్రతి ఒకరు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మోహన్​రెడ్డి మాట్లాడుతూ... టీచర్ల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. 

తనను గెలిపిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్సీ మోహన్​రెడ్డి మాట్లాడుతూ..యూనియన్​ లీడర్​గా, ఎమ్మెల్సీగా టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎంతగానో పని చేశానన్నారు. కొత్త కార్యవర్గ ప్రతినిధులు కష్టపడి పని చేయాలన్నారు. జిల్లా ప్రెసిడెంట్​, జనరల్ సెక్రటరీలు కుషాల్, శ్రీనివాస్​రెడ్డి, స్టేట్, జిల్లా, మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.