
హైదరాబాద్, వెలుగు : స్పౌజ్బదిలీల ద్వారా 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని పీఆర్ టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్రెడ్డి, పర్వతి సత్యనారాయణ కోరారు. నిరుడు సెప్టెంబర్లో బదిలీలు జరిగినా ఇంకా పలువురు టీచర్లు రిలీవ్ కాలేదని, వారిని రిలీవ్ చేయాలన్నారు. ఈ మేరకు బుధవారం వారు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతి పత్రం అందించారు. మోడల్స్కూల్స్టీచర్ల బదిలీలను చేపట్టాలన్నారు. ఎన్నికల కోడ్తో నిలిచిపోయిన జోన్ 2 పదోన్నతులను వెంటనే చేపట్టాలని.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రిటైర్అయిన వారికి పదోన్నతి అవకాశం కల్పించి ఆ హోదాపైనే రిటైర్అయినట్టు పేర్కొనాలని కోరారు. 2010 కన్నా ముందు నియమితులైన వారికి టెట్నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యా సంవత్సరానికి ముందే భాషా పండితులు, పీఈటీల అప్ గ్రేడేషన్ను చేపట్టాలని, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కేర్టేకర్లను నియమించాలని కోరారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బ్లైండ్టీచర్స్ సమస్యలు పరిష్కరించండి
దృష్టి లోపంతో బాధపడుతున్న టీచర్ల సమస్యలను పరిష్కరించాలని బ్లైండ్ ఎంప్లాయిస్అసోసియేషన్తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. రాఘవేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన నేతృత్వంలో బ్లైండ్ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతి పత్రం అందించారు. దృష్టి లోపంతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు లాంగ్ స్టాండింగ్ తో సంబంధం లేకుండా.. వారు కోరుకున్న ప్లేస్లోనే కొనసాగించాలని కోరారు. ఉద్యోగి కోరుకున్నట్టయితే సర్వీస్తో సంబంధం లేకుండా బదిలీకి అవకాశం కల్పించాలన్నారు. ఈ టీచర్లకు ఐరిస్అటెండెన్స్నుంచి మినహాయింపునివ్వాలని విన్నవించారు.