
- కామారెడ్డి జిల్లాలో 131, నిమాజామాబాద్ జిల్లాలో 82 ఫిర్యాదులు
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 131 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 20,370 ఫిర్యాదులు స్వీకరిస్తే ఇందులో 19,567 పరిష్కరించామని, 803 పెండింగ్లో ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న వాటిని వారం రోజుల్లో క్లియర్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వీణ, జడ్పీ సీఈవో చందర్నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ సిటీ, వెలుగు : నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 82 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్ ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.