
కాశీబుగ్గ (కార్పొరేషన్)/ హనుమకొండ కలెక్టరేట్/ ములుగు/ జనగామ అర్బన్/ మహబూబాబాద్, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం దరఖాస్తులు భారీగా వచ్చాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం 120 ఆర్జీలు వచ్చాయని ఆమె తెలిపారు. కాగా, 57వ డివిజన్లోని సమ్మయ్యనగర్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, బల్దియా మేయర్ గుండు సుధారాణితో కలిసి బల్దియా కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానిక సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం బల్దియా డైరీ ఆవిష్కరించారు. హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు వివిధ సమస్యలపై 106 వినతులు వచ్చాయని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ములుగులో మొత్తం 35 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. జనగామ గ్రీవెన్స్లో 43 వినతులు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ చెప్పారు. మహబూబాబాద్గ్రీవెన్స్లో 75 వినతులు వచ్చాయని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ తెలిపారు. ఆయా సమస్యలపై ఆరా తీసి పరిష్కరించాలని వారు అధికారులను ఆదేశించారు.