జర్నలిజం, రచన, నాటకం, సంగీత రంగాల్లో పులిట్జర్ ప్రైజ్ను అందజేస్తారు. 1917లో కొలంబియా యూనివర్సిటీ నిర్వాహకుడు, ప్రముఖ పాత్రికేయుడు జోసెఫ్ పులిట్జర్ పేరు మీద ఈ ప్రైజ్ను అందిస్తున్నారు. ఈ పురస్కారాలను కొలంబియా విశ్వవిద్యాలయం ఏటా అందజేస్తోంది. విజేతలకు ధ్రువీకరణ పత్రంతోపాటు రూ.11.58లక్షల నగదును ప్రదానం చేస్తారు. 2023కుగాను వర్గ భేదాలు ఇతివృత్తంగా రచించిన రెండు నవలలకు కాల్పినక సాహిత్యంలో పులిట్జర్ ప్రైజ్ను ప్రకటించారు. చార్లెస్ డికెన్స్ రచించిన డేవిడ్ కాపర్ ఫీల్డ్ నవలను ఆధునిక కాలానికి అన్వయిస్తూ బార్బరా కింగ్సాల్వర్ రచించిన డీమన్ కాపర్ హెడ్ నవలతోపాటు 1920ల నాటి న్యూయార్క్ నగరంలో సంపద, మోసాలే ఇతివృత్తంగా హెర్నన్ డియాజ్ రచించిన ట్రస్ట్ నవలకు పులిట్జర్ బహుమతులు ప్రకటించారు.
- జీవిత కథా విభాగంలో ఎఫ్పీఐ పూర్వ అధిపతి జె.ఎడ్గార్ హూవర్ జీవిత కథ జి–మ్యాన్కు పులిట్జర్ బహుమతి లభించింది. దీన్ని బెవర్లీ గేజ్ రచించారు.
- నాటక విభాగంలో ఇరానీ అమెరికన్ సనాజ్ టూస్సి రాసిన ఇంగ్లిష్కు చరిత్ర విభాగంలో జెఫర్సన్ కోవీ విరచిత ఫ్రీడమ్స్ డొమినియన్కూ పులిట్జర్ బహుమతులు దక్కాయి.
- ఆత్మకథా విభాగంలో హువాను రచించిన స్టేట్రూకు, కవిత్వ విభాగంలో కార్ల్ ఫిలిప్స్ సంకలనానికి, సంగీత విభాగంలో రియానన్ గిడెన్స్, మైకేల్ ఏబెల్స్ల గీతం ఓమార్కు పులిట్జర్ బహుమతులు లభించాయి.