అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాఉండవల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన దీపక్ జాతీయస్థాయిలో సత్తా చాటాడు. మధురైలో జరిగిన 24వ జాతీయ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో కరణం దివితేశ్ దీపక్ 2 కాంస్య పతకాలు, ఒక రజత పతకం సాధించాడు.
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, గ్రామ పెద్దలు దీపక్ ను అభినందించారు. దీపక్ తిరుపతిలోని శ్రీ పద్మావతి హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు.