
పేరుకు పెద్ద నగరం.. మహారాష్ట్రలో ముంబై తర్వాత అతిపెద్ద రెండో నగరం అది..ఆర్థికంగా, పారిశ్రామికంగా ముఖ్యమైన నగరం.. అనేక విశ్వ విద్యాలయాలు.. కళాశాలలకు నిలయం... ది ఆక్స్ ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ విజేత అయిన పుణె నగరంలో అపరిశుభ్రత, కలుషిత నీటి వనరులు రాజ్యమేలుతున్నాయి. వీటి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫుడ్పాయిజనింగ్తో అక్కడి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు.గత కొద్ది రోజులుగా వాంతులు, విరేచనాలు, కంటి జబ్బులు వంటి సీజనల్వ్యాధులు పెరుగుతుండటంతో ఈ నగరవాసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి.
పుణె నగరంలో కలుషిత ఆహారం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. నగరంలో జ్యూస్ సెంటర్లు, టీ కియోస్క్ లు, వడ పావ్ దుకాణాలు ఎటువంటి లైసెన్స్ లేకుండా.. యధేచ్చగా కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్నారు. ఫుణె నగరంలో ప్రతిరోజు హోటళ్లు, వీధి వ్యాపారులు తాగునీటితో పాటు నాణ్యతలేని ఆహారాన్ని విక్రయిస్తున్నారు.
Also Read :- టిఫిన్ తినకముందే.. ఈ 5 యోగాసనాలు వేయండి.. ఫుల్ జోష్
సంపాదనే లక్ష్యంగా వీరు విక్రయించే ఫుడ్లో ఎలాంటి పోషకాలు ఉండవు. ఆహార పదార్థాల తయారీలో ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వాంతులు, విరేచనాలు, కంటి జబ్బులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అయితే ఋ విషయంపై పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.
జంక్ ఫుడ్, కలుషిత నీరు వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. వర్షాకాలంలో ఫిల్టర్ చేసిన లేదా మరిగించిన నీటిని తాగడం చాలా ముఖ్యం.. పండుగలు, సెలవుల్లో ఎక్కువ మంది రెస్టారెంట్లు, హోటళ్లు, బయట ఫుడ్ కు తింటున్నారు.. ప్రజలు తప్పని సరిగా పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని పుణెలోని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తినాలని సూచిస్తున్నారు.