
కామారెడ్డి: యూకేజీ స్టూడెంట్తో పీఈటీ అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో నిందితుడిపై బీఎంఎస్, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితుడు నాగరాజుకి కఠినంగా శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న జీవదాన్పాఠశాల వద్ద జరిగిన గొడవలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. విధ్వంసంలో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులపైనా కేసులు పెడతామన్నారు. బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవు అని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దు అని సూచించారు.