
గోదావరిఖని, వెలుగు: మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వెహికల్స్ ఇస్తే చట్టపరంగా తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వేసవి హాలీడేస్ నేపథ్యంలో మైనర్లు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతారని, వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మైనర్లు, హెల్మెట్ లేకుండా వెహికిల్స్ నడపడం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్రూట్, త్రిబుల్ రైడింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ అంశాలపై 15 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు సీఐ తెలిపారు.