
- తయారు చేస్తున్న తెలంగాణ స్టార్టప్ ‘పర్పుల్ లైఫ్సైన్సెస్’
- పర్పుల్కార్న్, పసుపు,మెంతుల నుంచి తీసిన కాంపొనెంట్స్తో మందు
- ఇప్పటికే సొరియాసిస్ను నయం చేసే ఆయిల్తయారీ
హైదరాబాద్, వెలుగు: ఒంట్లో బ్లడ్ షుగర్ను కంట్రోల్చేయాలంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి.. ట్యాబ్లెట్లు వాడాలి. వాటితో ఒక్కోసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్కూడా పెరుగుతున్నదన్న వాదనా ఉన్నది. వాటికి చెక్పెట్టేందుకు నేచురల్ పరిష్కారాన్ని చూపించింది తెలంగాణకు చెందిన స్టార్టప్ సంస్థ పర్పుల్ లైఫ్సైన్సెస్. నల్గొండకు చెందిన మణికంఠ రెడ్డి, వికారాబాద్కు చెందిన రాఘవరెడ్డి కలిసి ఏర్పాటు చేసిన ఈ నేచురల్ ఔషధ తయారీ స్టార్టప్కు టీహబ్సహకారమందిస్తున్నది. పర్పుల్కార్న్ నుంచి యాంథో సయనిన్ను సహజసిద్ధంగా ఎక్స్ట్రాక్ట్ చేసి.. వాటికి పసుపు, మెంతుల నుంచి సహజంగా తీసిన పదార్థాలను కలపడం ద్వారా డయాబెటిస్ను తగ్గించే మందును పర్పుల్లైఫ్సైన్సెస్ సంస్థ తయారు చేస్తున్నది. ప్రస్తుతం ఇది ట్రయల్స్ దశలో ఉన్నదని మణికంఠ రెడ్డి, రాఘవరెడ్డి చెప్తున్నారు. అన్ని ట్రయల్స్ పూర్తయ్యాక అతి త్వరలోనే దీనిని మార్కెట్లోకి తీసుకొస్తామంటున్నారు. తొలుత డయాబెటిస్ను కంట్రోల్ చేసే మందులతో కలిపి ఈ మందును ఇస్తారని వారు పేర్కొన్నారు. క్రమంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాక.. ఔషధాల అవసరం లేకుండానే ఈ సహజమైన మందును వాడొచ్చని, షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
ప్రత్యేకంగా పర్పుల్ కార్న్ పంట..
మణికంఠ రెడ్డి, రాఘవ రెడ్డి.. డయాబెటిస్ ఔషధమే కాకుండా ఇప్పటికే సోరియాసిస్ను తగ్గించే సోకేర్అనే సహజసిద్ధమైన ఆయిల్ను తయారుచేశారు. అలాగే, శ్వాసకోశ సంబంధ సమస్యలు సహా ఐదు రకాల మందులను తయారు చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. ఈ అన్ని ఔషధాల్లోనూ వీరు కామన్కాంపొనెంట్గా యాంథో సయనిన్ను తీసుకుంటున్నారు. దానినీ సహజసిద్ధంగానే తయారు చేస్తున్నారు. అందుకోసం తన స్వస్థలం తిప్పర్తిలో తమకున్న వ్యవసాయ భూమిలోనే పర్పుల్కార్న్ను ప్రత్యేకంగా పండిస్తున్నట్టు మణికంఠ రెడ్డి చెప్పారు. దానిని ప్రాసెస్ చేసి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసే యాంథోసయనిన్ను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామని వివరించారు. సోరియాసిస్ కోసం తయారు చేసిన సో కేర్ ఆయిల్తో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.