
పద్మారావునగర్, వెలుగు: పుష్ప-2 సినిమా రిలీజ్సందర్భంగా ఆర్టీసీ క్రాస్రోడ్ సంధ్య థియేటర్వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ను మంగళవారం సికింద్రాబాద్కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ల సూచనతో న్యూరో రిహాబిలిటేషన్సెంటర్ కు షిఫ్ట్చేశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త బెటర్అయిందని, ఆక్సిజన్, రెస్పరేటరీ సపోర్టు లేకుండానే నోటి ద్వారా ఫుడ్ తీసుకుంటున్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
‘‘శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడు. కానీ మనుషులను గుర్తుపట్టడం లేదు. బ్రెయిన్ఇంకా రికవరీ కాలేదు. 15 రోజుల నుంచి నోటి ద్వారా లిక్విడ్స్ తీసుకుంటున్నాడు. కిమ్స్డాక్టర్లు రెండు వారాల శ్రీతేజ్ను ఐసీయూ నుంచి స్పెషల్రూమ్కు షిఫ్ట్చేశారు. ఆసుపత్రిలోనే ఉంటే మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి.
న్యూరో రిహాబిలిటేషన్సెంటర్లో ఉంచితే ఇన్ఫెక్షన్స్తగ్గుతాయని డాక్టర్లు తెలిపారు. అందుకే అక్కడికి షిఫ్ట్చేస్తున్నాం. 15 రోజులపాటు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇప్పించాలి. కిమ్స్లో అడ్మిట్ అయిన నాటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆసుపత్రి యజమాన్యం నన్ను డబ్బులు అడగలేదు. ఖర్చంతా పుష్ప మూవీ టీమ్ నే చూసుకుంది. వారితోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, మీడియా నుంచి ఎంతో సపోర్టు లభించింది. అందరికీ కృతజ్ఞతలు’’ అని శ్రీతేజ్తండ్రి భాస్కర్తెలిపారు. కాగా గతేడాది డిసెంబర్ 4న శ్రీతేజ్ ను కిమ్స్ లో అడ్మిట్చేయగా, 4 నెలల 25 రోజులపాటు ట్రీట్మెంట్ కొన సాగింది.