
హైదరాబాద్, వెలుగు: మాదిగలను 9 ఏండ్ల పాటు పట్టించుకోని ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు ప్రేమను ఒలకబోస్తున్నరని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల విమర్శించారు. పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ ప్రసంగం స్టంట్లాగా ఉందన్నారు. నటించడంలో మోదీ, కేసీఆర్ఇద్దరూ ఇద్దరేనన్నారు. సోమవారం ఆమె గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. మంద కృష్ణ మాదిగ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
మాదిగ సమాజం ఆయన వ్యాఖ్యలను చూసి షాక్ అవుతున్నదని తెలిపారు. విశ్వరూప సభ తనకు బ్లాక్ డే లాగా అనిపించిందని చెప్పారు. తన జాతిని మోదీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల పక్షాన ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్కు మాత్రమే దళితులకు ఓటు అడిగే అర్హత ఉందని వెల్లడించారు. కవితను వదిలిపెట్టి సోనియా గాంధీపై ఈడీ కేసులు పెడుతున్నదని, దాన్ని బట్టే బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ ఏంటనేది అర్థమవుతున్నదని విమర్శించారు.
ALSO READ : హోటల్ వర్కర్పై గ్యాంగ్ రేప్