
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన "పుష్ప" సినిమాలో విలన్ గా నటించిన కన్నడ హీరో ధనుంజయ్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఈ సినిమాలో జాలి రెడ్డి డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. అయితే నటుడు ధనుంజయ్ పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో ధనుంజయ్ కర్ణాటకకు చెందిన ఓ ప్రముఖ బిజినెస్ మెన్ కూతురు ధన్యత అనే అమ్మాయిని పెద్దలు కుదురిచ్చిన వివాహం చేసుకున్నాడు.
వీరి పెళ్లి మైసూరులోని మైసూర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆదివారం (ఫిబ్రవరి 16) ఘనంగా జరిగింది. ఈ వివాహానికి కర్ణాటకకు చెందిన పలువురు సినీ సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ పెళ్ళికి వెళ్లినట్లు సమాచారం.
ALSO READ | రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన తండేల్.... నాగ చైతన్య కెరీర్ లో ఇదే టాప్..
అయితే నటుడు ధనుంజయ్ ఈమధ్య తెలుగు సినిమాల్లో నటించడానికి బాగానే ఆసక్తి చూపుతున్నాడు. ఆ మధ్య తెలుగులో ప్రముఖ హీరో సత్యదేవ్ తో కలసి నటించిన జీబ్రా సినిమా బాగానే ఆకట్టుకుంది. ఓటిటి లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో త్వరలోనే స్ట్రైట్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.