కొరియోగ్రాఫర్ జానీ కేసులో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నారా?..స్పందించిన ‘పుష్ప’ నిర్మాత రవిశంకర్‌

కొరియోగ్రాఫర్ జానీ కేసులో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నారా?..స్పందించిన ‘పుష్ప’ నిర్మాత రవిశంకర్‌

సినీ కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల కేసు వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు బాధితురాలికి మద్దతుగా ఉన్నారంటూ వస్తోన్న వార్తలపై తాజాగా 'పుష్ప’ (Pushpa) నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ స్పందించారు. అయితే జానీపై కేసు పెట్టిన ఆ యువతి మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పుష్ప -2 లోని ఓ సాంగ్కు అడిషనల్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్న  విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇవాళ సోమవారం సెప్టెంబర్ 23న మత్తు వదలరా 2’ సినిమా నిర్మాత అయిన రవిశంకర్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

ఈ మేరకు ‘‘కొరియోగ్రాఫర్ జానీ వ్యవహారంలో అల్లు అర్జున్‌, సుకుమార్‌ పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దానిపై మీరు ఏదైనా క్లారిటీ ఇవ్వగలరు?’’ అని మీడియా ప్రశ్నించగా.. 

"ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌ కావడం కోసం కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పటివరకూ వచ్చిన సమాచారం, వార్తలను బట్టి చూస్తే అది వాళ్ల (కొరియోగ్రాఫర్ జానీ, బాధితురాలు) వ్యక్తిగతమైన విషయమని అర్థమవుతోంది.

‘పుష్ప 2’ మూవీ స్టార్ట్ అయినప్పుడే అడిషనల్‌ కొరియోగ్రాఫర్‌గా ఆమెను తీసుకున్నాం. సినిమాలోని అన్ని పాటలకు ఆమె వర్క్‌ చేస్తారు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. అక్టోబర్‌ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు ప్లాన్‌ చేస్తున్నాం. వాటికి కూడా ఆ అమ్మాయి ఉంటుంది. అలాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుంది దానికి జానీ కొరియోగ్రఫర్ ఇంతలో ఇది జరిగింది అన్నారు. 

జానీ వివాదం గురించి అల్లు అర్జున్‍కు పెద్దగా తెలియదని నిర్మాత రవిశంకర్ అన్నారు. కొందరు ఏదో ఒకటి చెబుతున్నారని అన్నారు. “డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ అంటూ విషెస్ చెబితే హీరో (అల్లు అర్జున్).. తిరిగి పలుకరిస్తారు. అంతకంటే ఆయనకు ఏమీ తెలియదు. జానీని ఆపేసి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలని ఆయన అసలు అనుకోలేదు. అలాంటివి ఏమీ ఉండవు.

ఆరు నెలల ముందు రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలోనూ ఆ అమ్మాయి పేరు ఉంది. కొందరు చేస్తున్న అలజడిలో నిజాలు లేవు” అని రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. కానీ కొందరు కొత్తగా వచ్చిన యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళ సెన్సేషన్ కోసం బన్నీ ఆ యువతికి  అండగా ఉన్నారు అని ఫేక్ న్యూస్ లు రాసారు. ప్రధాన మీడియా ఇలాంటి వార్తలు ఏమీ రాయడం లేదు.

అయితే, వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అది వారి వ్యక్తిగతం.. దానిపై మనం కామెంట్‌ చేయకూడదు’’ అని తెలిపారు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అల్లు అర్జున్‌కు డాన్స్ టీమ్ గురించి పెద్ద‌గా ఏం తెలీదు. బ‌న్నీ స్టేచ‌ర్‌కి ఇవ‌న్నీ చాలా చిన్న విష‌యాలు. వాళ్ల మ‌ధ్య ఏం గోల ఉన్నా మాకు సంబంధం లేదు..అని మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ క్లారిటీ ఇచ్చారు.