ఆమనగల్లు, వెలుగు : ధ్యాన గురువు, పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సుభాష్ పత్రీజీ (75) కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రం సమీపంలోని మహేశ్వర మహా పిరమిడ్లో ఆదివారం సాయంత్రం చనిపోయారని పిరమిడ్ నిర్వాహకులు తెలిపారు. ఆయన కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. 1947లో బోధన్లో జన్మించిన ఆయన.. శ్వాసపై ధ్యాసే ధ్యానం అని, శాకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని ప్రచారం చేశారు. ధ్యాన మార్గాన్ని ఎంచుకుని 40 ఏళ్లలో లక్షలాది మందిని ధ్యానం వైపు మళ్లించారు. 50 వేలకు పైగా ధ్యాన కేంద్రాలను స్థాపించారు. తాను ఆధ్యాత్మిక సేవ చేయడానికే వచ్చానని ఎందరో ధ్యానులు, మాస్టర్లను తయారు చేశానని గతంలో ఆయన పేర్కొన్నారు. తాను రెండు రోజుల్లో దేహాన్ని వీడివెళ్తానని, తన మరణాన్ని మూడు రోజులపాటు సంబురంగా నిర్వహించాలని పత్రీజీ ఇంతకు ముందు సందేశం ఇచ్చారని మహేశ్వర మహా పిరమిడ్ నిర్వాహకులు తెలిపారు. ఆయన సందేశం ప్రకారం పిరమిడ్లో మూడు రోజులపాటు సంబు రాలు నిర్వహిస్తున్నామని వారు ఓ ప్రకటనలో తెలిపారు. పత్రీజీ మృతి వార్త తెలుసుకున్న ధ్యానులు, మాస్టర్లు మహా పిరమిడ్కు తరలివెళ్తున్నారు.
కిడ్నీ వ్యాధితో పత్రీజీ కన్నుమూత
- తెలంగాణం
- July 25, 2022
లేటెస్ట్
- నా పెళ్లాం ఊరెళ్లింది.. నేను చాలా హ్యాపీ : ఆటోడ్రైవర్ టాలెంట్
- చంద్రబాబు ఢిల్లీలో.. లోకేష్ ఏపీలో: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- Simona Halep: అనుకున్నది సాధించాను.. టెన్నిస్కు మాజీ వరల్డ్ నెంబర్ 1 రిటైర్మెంట్
- లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర తగలబడ్డ గుడిసెలు
- Delhi Elections:ఢిల్లీ పీఠం బీజేపీదే..ఎగ్జిట్ పోల్ సర్వేలు
- పవన్, మహేష్ సినిమాలతో రూ.100 కోట్లు నష్టపోయిన ప్రొడ్యూసర్... రాద్ధాంతం చేసుకోకండంటూ బండ్ల గణేష్ ట్వీట్..
- V6 DIGITAL 05.02.2025 EVENING EDITION
- చికెన్ తినేటోళ్లు జాగ్రత్త: ఏపీలో అంతుచిక్కని వైరస్.. నెలరోజుల్లో 4 లక్షల కోళ్లు మృతి..
- Hardik Pandya: నా కోసం కాదు, దేశం కోసం ఆడుతున్నా.. దేశం తరుపున ఆడుతున్నా: పాండ్య
Most Read News
- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షల 70 వేలు సంపాదిస్తున్నారా..? ట్యాక్స్ కట్టక్కర్లేదు.. అదెలా అంటే..
- డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం.. 10 రోజుల్లో 4వేలు పెరిగింది.. హైదరాబాద్లో తులం రేటు ఇది..
- SA20: సన్ రైజర్స్తో సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?
- తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు
- Health Tips: చికెన్, మటన్ లివర్లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- మినీ మేడారం జాతరకు 200 బస్సులు రెడీ..గ్రేటర్ వరంగల్ 3 డిపోల నుంచి ఆర్టీసీ సేవలు
- తిరుమల కొండపై యహోవా కారు : అన్యమత ప్రచారంపై భక్తుల ఆగ్రహం