
- కుతుబ్షాహీల కాలం నాటి సమాజంలోని వివిధ కులాల వారి వేషభాషలు, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలను వివరించే శుకసప్తతిని పాలవేకిరి కదరీపతి రచించాడు.
- బ్రాహ్మణులు భుజంపై వేసుకునే మడి పంచెను ధావళి అనేవారు.
- మల్హణ చరిత్రను పెదపాటి ఎర్రనార్యుడు రచించాడు.
- తానీషా ప్రభుత్వం వేశ్యావాటికల నిర్వహణకు ఖజానా నుంచి 3.24లక్షలు ఖర్చు చేసిందని గిర్ధారీలాల్ రాశాడు.
- గోల్కొండ రాజ్యంలోని ముస్లింల వేషధారణ ఎలా ఉండేదో వర్ణించిన 17వ శతాబ్దానికి చెందిన గోగుపాటి కూర్మనాథుని రచన సింహాద్రి నారసింహ శతకం.
- పూరీ జగన్నాథ యాత్రలో రథచక్రాల కింద బలవంతంగా పడి ప్రాణాలు వదిలితే మోక్షం లభిస్తుందని నమ్మేవారని ఫ్రెంచి యాత్రి ఫ్రాంకోయిస్ బెర్నియర్ పేర్కొన్నాడు.
- కుతుబ్షాహీల కాలంలో స్థానిక అధికారులు సతి ఆచారాన్ని ప్రోత్సహించారని పేర్కొన్న థామస్ బేరీ రచన ఎ జాగ్రఫికల్ అకౌంటింగ్ ఆఫ్ ది కంట్రీస్ ఎ రౌండ్ ది బే ఆఫ్ బెంగాల్.
- కుతుబ్షాహీల కాలం నాటి ముఖ్య పండుగలు దసరా, దీపావళి, హోళీ, రంజాన్, బక్రీద్, నవ్రోజ్, మొహర్రం.
- పొన్నగంటి తెలగనార్యకవి రచన యయాతి చరిత్ర.
- గోల్కొండ రాజ్యంలో మచిలీపట్నం కేంద్రంగా మధ్య ఆసియా, ఐరోపా దేశాలతో భారీ ఎత్తున విదేశీ వ్యాపారం సాగేది.
- కుతుబ్షాహీల కాలంలో వ్యవసాయ భూములు రెండు రకాలు. అవి.. జమిందారీ భూములు, హవేలి భూములు.
- హైదరాబాద్లోని సైఫాబాద్ పరిసరాల్లో రాజమాత మా సాహెబా(ఖానం ఆఘా) ఒక చెరువును తాగునీటి కోసం తవ్వించారు. దానిని మా సాహెబ్ ట్యాంక్ అని పిలిచేవారు.
- క్రీ.శ.1551 నాటి ఒక శాసనం ప్రకారం ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఉదయ సముద్రం, పొనగల్ చెరువులకు మరమ్మతులు చేయించారు.
- దశబంధువు భూముల్లో భూమి శిస్తు 1/10 వంతు వసూలు చేసేవారు.
- కుతుబ్షాహీల కాలంలో దేశీయ, విదేశీయ వ్యాపారంలో కోమట్లు కీలక పాత్ర పోషించారు.
- కుతుబ్షాహీలకు మేలు రకం గుర్రాలను అరబ్, పోర్చుగీసు వర్తకులు సరఫరా చేశారు.
- ఐరోపా వర్తక సంఘాలు ప్రవేశించిన తర్వాత గొప్ప వర్తక కేంద్రాలుగా నరసాపురం, మచిలీపట్నం, గోల్కొండ, మద్రాసు, కొండపల్లి రూపొందాయి.
- కుతుబ్షాహీల కాలంలో జరిగే సముద్రాలపై జరిగే విదేశీ వ్యాపారాన్ని ఓడబేరం అని పిలిచేవారు.
- కుతుబ్షాహీల కాలంలో విదేశీ వ్యాపారానికి ముఖ్య కేంద్రాలు మోటుపల్లి, నరసాపురం, మచిలీపట్నం.
- ఐరోపా దేశాలకు మేలు రకం వస్త్రాలను మచిలీపట్నం నుంచి ఎగుమతి చేసేవారు.
- కుతుబ్షాహీల కాలం నాటి సాహిత్యంలో పేర్కొన్న ఇద్దరు సంపన్న వర్తకులు వసుమత, విష్ణుదాస.
- ఓడల నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు నర్సాపురం, మచిలీపట్నం.
- కుతుబ్షాహీల కాలంలో ఇనుము, పోత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని ప్రాంతాలు నిర్మల్, ఇందల్వాయి.
- గోల్కొండ రాజ్యంలో ముఖ్య కరెన్సీ హోన్న అనే బంగారు నాణెం.
- గోల్కొండ రాజ్య కరెన్సీ అయిన హోన్నును విదేశీ వర్తకులు పగోడ అనే పేరుతో పిలిచేవారు.
- హోన్నుతోపాటు గోల్కొండ రాజ్యంలో చెలామణిలో ఉన్న ఇతర నాణేలు పణం, తార్, కాసు.
- కుతుబ్షాహీల కాలం నాటి ఎగుమతుల్లో ముఖ్యమైనవి వస్త్రాలు, వజ్రాలు, సూరేకారం, తివాచీలు, నీలిమందు, మేలురకం కత్తులు.
- కుతుబ్షాహీల కాలం నాటి ముఖ్యమైన దిగుమతులు గుర్రాలు, సుగంధ ద్రవ్యాలు, బంగారం, సీసం, ఖర్జూర పండ్లు, కస్తూరి, పింగాణీ పాత్రలు, గవ్వలు.
- కుతుబ్షాహీల కాలంలో మేలు రకపు వజ్రాలకు నిలయాలైన గనులు గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని కొల్లూరు, కర్నూలు జిల్లాలోని రామళ్లకోట.
- క్రీ.శ.1640లో కొల్లూరు గనిలో 60వేల పనివారు ఉండేవారని విదేశీ యాత్రికుడు ఫ్రెంచికి చెందిన టావెర్నియర్ తెలిపాడు.
- - హైదరాబాద్లో వజ్రాలకు సానపెట్టే పరిశ్రమ కార్వాన్లో ఉండేది.
- ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం అబ్దుల్లా కుతుబ్షా కాలంలో క్రీ.శ.1656లో కొల్లూరు వజ్రపు గనిలో లభించింది.
- కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ మహారాణి విక్టోరియాకు బహుమతిగా లార్డ్ లారెన్స్ ఇచ్చారు.