బీసీలంతా ఐక్యమత్యంగా ఉండాలి : ఆర్ కృష్ణయ్య

బీసీలంతా ఐక్యమత్యంగా ఉండాలి : ఆర్ కృష్ణయ్య

బీసీలంతా ఐక్యమత్యంగా ఉండాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య. హైదరాబాద్ లక్డికపూల్ లో బీసీ డిమాండ్స్ పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్.కృష్ణయ్య, MLC తీన్మార్ మల్లన్న, బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఆర్. కృష్ణయ్య. భారీ ఉద్యమం వస్తేనే రాజ్యంగంలో మార్పు వస్తుందన్నారు. బీసీలు అప్రమతంగా ఉండాలి... అన్నింటికీ  సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ..42శాతం రిజర్వేషన్ తో పాటు బీసీకులగణన చేపట్టే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు MLC తీన్మార్ మల్లన్న.రాజకీయాల్లో, ఉద్యోగం అవకాశాల్లో బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. మిగలిగిన ఆరు మంత్రి పదువులు బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు తీన్మార్ మల్లన్న.