
దుబ్బాక, వెలుగు: దుబ్బాకకు మొదటి విలన్ మంత్రి హరీశ్రావేనని బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్రావు విమర్శించారు. శనివారం అక్భర్పేట-భూంపల్లి మండల చౌరస్తాలో జరిగిన బీజేపీ కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను మంత్రి హరీశ్రావు అడ్డదారిలో సిద్దిపేటకు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. అక్భర్పేట-భూంపల్లి మండలం కాకుండా, దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయకుండా అడ్డుకున్నారని విమర్శంచారు.
ఉప ఎన్నికల్లో ఇక్కడి ప్రజలకిచ్చిన మాట ప్రకారం అక్భర్పేట-భూంపల్లి మండలాన్ని చేశానన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అక్భర్పేట చౌరస్తాలోని ఇండ్లు, భూములు పోవద్దని ఇక్కడి ప్రజలను ఢిల్లీకి తీసుకుపోయి ఆపింది రఘునందన్రావు అని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా నిలబడ్డ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలని అడగకుండా పబ్ కావాలని అడగడం చూస్తే దుబ్బాక ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు.
పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కానీ 24 గంటల లిక్కర్ సరఫరా చేసే బెల్ట్షాపులొచ్చాయని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటించినప్పుడు అక్కడే ఉన్న ఎంపీ, మంత్రి దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయమని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్తోతెలంగాణ ఉద్యమంలో పని చేసిన దుబ్బాక మండలం చీకోడు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్నాయకులు, కళాకారుడు కొంగరి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు.