
కోల్బెల్ట్, వెలుగు: పీసీసీ స్టేట్జనరల్సెక్రటరీగా కొనసాగుతున్న రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్సీనియర్ లీడర్ పిన్నింటి రాఘునాథ్రెడ్డి ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆదివారం నిజామాబాద్లో జరిగిన రాష్ట్ర సంఘం నూతన కమిటీ ఎన్నికల్లో రాఘునాథ్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఆయన నాలుగేండ్ల పాటు జాయింట్సెక్రటరీగా కొనసాగనున్నారు. జాతీయ స్థాయి ఫుట్బాల్క్రీడాకారుడైన రాఘునాథ్రెడ్డి ఆదిలాబాద్ఉమ్మడి జిల్లాలో జాతీయ, రాష్ట్రస్థాయి ఫుట్బాల్పోటీలను నిర్వహిస్తూ ఔత్సాహిక క్రీడాకారులను వెలికితీస్తూ ప్రోత్సహిస్తున్నారు.