- బాత్రూమ్లో జూనియర్లపై సీనియర్ల దాడి
- ఇద్దరు స్టూడెంట్లకు గాయాలు.. కేసు నమోదు
శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ స్టూడెంట్లు రెచ్చిపోయారు. ర్యాగింగ్ పేరుతో జూనియర్ స్టూడెంట్లపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న కాలేజీలో సెమినార్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి స్టూడెంట్లంతా హాజరయ్యారు. అయితే ‘సెమినార్కు పిలిచి సీనియర్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియాదా?
ఫస్ట్ సీనియర్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి’ అంటూ కొందరు సీనియర్ స్టూడెంట్లు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఇద్దరిని కాలేజీ బాత్రూమ్లో బంధించి, పిడి గుద్దులు కురిపించారు. గాయపడిన ఇద్దరు స్టూడెంట్లు మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐదుగురు స్టూడెంట్లపై పీటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.