వరదబాధితులకు రహేజా గ్రూప్ రూ.5కోట్లు సాయం

వరదబాధితులకు రహేజా గ్రూప్ రూ.5కోట్లు సాయం

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ అతలకుతలం అయిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు చాలా జిల్లాల్లో భారీ ఆస్థి, ప్రాణ నష్టం జరిగింది. అయితే వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపట్టింది. దీంతోపాటు ప్రముఖ కంపెనీలు, సంస్థలు, దాతలు వరద బాధితులకు కోసం సాయం అందజేస్తున్నారు. వరద బాధితు లను ఆదుకునేందుకు ప్రముఖ వ్యాపార వేత్త  కే రహేజా గ్రూప్ ప్రెసిడెంట రవి రహేజా భారీగా విరాళాలు అందజేశారు. 

శనివారం ( సెప్టెంబర్ 7) జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డిని రవి రహేజా కలిశారు.  వరద బాథులు సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కి రహేజా గ్రూప్ తరపు రూ. 5కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన రహేజా గ్రూప్ సంస్థల యాజమాన్యానికి కృతజ్ణతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 

ALSO READ | నిండుకుండలా ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు..