బహుజనులను అణగదొక్కుతోంది : రాహుల్

బహుజనులను అణగదొక్కుతోంది : రాహుల్

పాట్నా: బిహార్​లోని బీజేపీ కూటమి ప్రభుత్వం బహుజనులను అణగదొక్కుతోందని కాంగ్రెస్ మాజీ చీఫ్​ రాహుల్ గాంధీ విమర్శించారు. బహుజనులు కనీసం రాజ్యాంగ, సామాజిక హక్కులను డిమాండ్ చేసే పరిస్థితిలేదన్నారు. ‘‘నవాడాలో మహాదళితుల కాలనీకి నిప్పు పెట్టా రు. ఈ ఘటనలో 80 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

బిహార్​లో బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ ఘటన సూచిస్తుంది. ఈ నేరానికి పాల్పడిన వారిపై బిహార్ ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి” అని రాహుల్ గాంధీ డిమాండ్​ చేశారు.