కాలినడకన తిరుమలకు రాహుల్

కాలినడకన తిరుమలకు రాహుల్

తిరుపతి: ఏపీ పర్యటన కోసం ఇవాళ తిరుపతికి వచ్చారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. పర్యటనకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాలినడక బయల్దేరారు. ఈ ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అలిపిరి చేరుకుని కాలినడకన బయల్దేరారు. ఆయనతో పాటు మేనల్లుడు రైహాన్ వాద్రా (ప్రియాంక గాంధీ కొడుకు) కూడా తిరుమలకు నడిచి వెళ్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ‘ఏపీకి ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్ర’ బహిరంగ సభలో పాల్గొంటారు. హోదాపై పార్టీ వైఖరిని వెల్లడించనున్నారు.