దళిత కుటుంబంతో కలిసి వంట చేసిన రాహుల్ గాంధీ

దళిత కుటుంబంతో కలిసి వంట చేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మహారాష్ట్రంలోని ఓ దళితుడైన సామాన్య కార్యకర్త ఇంట్లో భోజనం చేశారు. కొల్హాపూర్ లోని  షాహు పటోలే ఇంటి సాదరంగా ఆహ్వానించగా.. రాహుల్ గాంధీ వెళ్లారు. వారితో పాటు వంటగదిలో వివిధ వంటకాలు వండటం నేర్చుకున్నారు. షాహు పటోలే సనాదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా అనే పుస్తకాన్ని కూడా రాశారు.  గాంహుల్ గాంధీ సోమవారం దళితుల సంప్రదాయాల్లోని వివిధ వంటకాలను రాహుల్ గాంధీ రుచిచూశారు.

ALSO READ | మోదీ పాత ప్రసంగాలు ....దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలు కప్పిపుచ్చలేవు :  మల్లికార్జున్‌‌ ఖర్గే

పటోలే ఇంట్లో హర్భర్యాచి భాజీ, పాలకూర మరియు వంకాయలతో తుపర్ పప్పు తయారు చేశారు. వంటచేయడంలో ఆయనకు రాహుల్ జీ సహాయం చేశారు. షాహు పటోలే, ఆయన భార్య అంజనాతో కలిసి భోజనం చేశారు. దళితుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దళితుల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా సూచించారు. రాహుల్ గాంధీకి షాహు పటోలే దలిత్ కిచెన్స్ ఆఫ్ మరాఠ్వాడా  గురించి వివరించారు.