
ఉప్పల్, వెలుగు: ఉప్పల్లో జీహెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఏవీడీ స్వీట్స్ కంపెనీ, పిస్తా హౌస్, సురభి హోటల్లో తనిఖీలు చేసి నోటీసులు జారీ చేశారు. పిస్తా హౌస్ కిచెన్ అపరిశుభ్రంగా ఉందని, శాంతినగర్లోని ఏవీడీ కంపెనీలో వేడి పదార్థాలను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేశారని పేర్కొన్నారు. సురభి హోటల్ కిచెన్ సైతం సీజ్ చేశామన్నారు. ఆయా హోటల్లోని శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించినట్లు చెప్పారు.