
దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో వివిధ విభాగాల్లో మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టులను భర్తీకి రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
ఖాళీలు: మొత్తం 9000 పోస్టుల్లో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 1,100, టెక్నీషియన్ గ్రేడ్-III: 7,900 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18- నుంచి 36 ఏళ్లు. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18- నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 బేసిక్ జీతం చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 9 నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలి.