రైల్వే ట్రాక్ పనులు పూర్తి ట్రయిల్ రన్ షురూ

రైల్వే ట్రాక్ పనులు పూర్తి ట్రయిల్ రన్ షురూ

ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయిన మహబూబాబాద్ జిల్లా తాళ్ల పూసల వద్ద రైల్వే ట్రాక్ పునురుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీంతో ట్రయల్ రన్ నిర్వహించారురైల్వే అధికారులు. ట్రయల్ రన్ అనంతరం యధావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది. 

రెండు రోజులపాటు డే అండ్ నైట్ శ్రమించి ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్న రైల్వే సిబ్బంది. దీంతో పాటు కేసముద్రం మండలం ఇంటికన్నె వద్ద చివరి దశకు చేరుకున్నాయి. బుధవారం (సెప్టెంబర్ 4) ఉదయం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.