మెదక్​ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా..మాజీ ఎమ్మెల్యే శశిధర్​ రెడ్డి

మెదక్​ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా..మాజీ ఎమ్మెల్యే శశిధర్​ రెడ్డి

పాపన్నపేట,వెలుగు: వచ్చే ఎన్నికల్లో మెదక్​ ఖిల్లాపై  కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌‌ఎస్‌  తొమ్మిదేళ్లలో అమలుకాని హమీలు, ఇచ్చి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.  

సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో జరిగిన​ అభివృద్ధిలో 10 శాతం కూడా  మెదక్ నియోజకవర్గంలో జరగలేదన్నారు. ప్రతి గ్రామం తిరిగి బీఆర్‌‌ఎస్‌ మోసాలను ప్రజలకు వివరిస్తామమన్నారు.  హైకమాండ్ ఎవరికి టికెట్​ఇచ్చినా వారితో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.