రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య.... లావణ్య వర్సెస్ మాల్వీ మల్హోత్ర మధ్య ఎన్నో ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. . రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హీరోయిన్ మాల్వీ మల్హోత్ర మోజులో పడి తనను వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.టాలీవుడ్లో ప్రస్తుతం రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.. ఈ విషయంపై రాజ్ తరుణ్ వచ్చి మీడియా వేదికగా తన తప్పేమి లేదంటూ ప్రకటించాడు. లావణ్య, మస్తాన్ సాయి ఇలా కలిసి చేస్తున్నారు. మస్తాన్ సాయికి లావణ్యకు రిలేషన్ ఉంది. డబ్బుల కోసమే వారు ఇలా చేస్తున్నారు అంటూ రాజ్ తరుణ్ వెల్లడించాడు అయితే ఈ వ్యాఖ్యలపై లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది.
రాజ్ తరుణ్ కావాలని మాపై ఆరోపణలు చేస్తున్నాడు. నాకు రాజ్ తరుణ్కు పెళ్లి అయ్యింది. మేము పెళ్లి చేసుకున్న ఫొటోలు నా ఫోన్లో ఉండేవి వాటిని రాజ్ తరుణ్ డిలీట్ చేశాడు. రాజ్ తరుణ్ లైఫ్లోకి తాను హీరో అయ్యాకా రాలేదని లావణ్య తెలిపింది. మస్తాన్ సాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. నన్ను వదిలించుకోవాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాడు. అందుకు డ్రగ్స్, మస్తాన్ సాయి అంటూ కథలు చెబుతున్నాడు. అతడు ఉయ్యాలా జంపాలా సినిమా తీసే టైంలోనే పక్క పక్క ఇళ్లల్లో ఉండేవాళ్లం. మా పెళ్లి విషయం సమయం వచ్చినప్పుడు నేనే బహిరంగంగా ప్రకటిస్తానని తెలిపాడు అందుకే అతడిని నమ్మాను. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను. నేను ముసలిదాన్ని అయిన కూడా అతనే నా మనసులో ఉంటాడు.
రాజ్ తరుణ్ ...మాల్వీ మల్హోత్ర మోజులో పడింది వాస్తమని లావణ్య తెలిపింది. . బ్యాంకు లావాదేవీలు చెక్ చేయండి.. కాల్ లిస్ట్ చూడండి. హోటల్లో ఉన్న లిస్ట్ కూడా తనదగ్గరయ ఉందని లావణ్య తెలిపింది నాకు సహయం చేసేవారు ఎవరు లేక... పోలీస్ స్టేషన్కు వేళితే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావని రాజ్ తరుణ్ అంటున్నాడు. మాల్వీ మల్హోత్ర ఫాదర్ హిమచల్ ప్రదేశ్ సీఏం ఫ్రెండ్. నువ్వు కేసు పెడితే వాళ్లు కేసు పెట్టారు. నువ్వు గొడవ చేస్తే వాళ్లు చేయరు అనుకుంటున్నావా.. వాళ్లు తలచుకుంటూ నెక్స్ట్ సెకండ్లో నువ్వు జైలుకి వెళతావు బయటికి కూడా రావు అంటూ లావణ్య చెప్పుకొచ్చింది.