
రామాయంపేట, వెలుగు: మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన సీఎం వ్యక్తిగత కార్యదర్శి రాజశేఖరెడ్డి తల్లి రత్నమ్మ (80) అనారోగ్యంతో మృతి చెందింది. సోమవారం ఆమె అంత్యక్రియలకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు.