![నయనతార అన్నపూరణి మూవీపై రాజాసింగ్ ఆగ్రహం](https://static.v6velugu.com/uploads/2024/01/rajasingh-angry-over-nayanthara-annapurani-movie_MeuA0QLTUE.jpg)
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) నటించిన అన్నపూరణి(Annapoorani) మూవీ వివాదం రోజురోజుకి దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెద్దఎత్తున కేసులు నమోదైయ్యాయి. సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని, సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ నుండి తొలగించిన ఆ సంస్థ.. క్షమాపణలు కోరుతున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.
#WATCH | Hyderabad, Telangana: On 'Annapoorani' movie, BJP leader T Raja Singh says, "I have heard that Zee Studios has apologized but an apology will do nothing. We have seen many times that such films are being made to hurt the sentiments of Hindus...I appeal to Union Home… pic.twitter.com/pOMDyA7EY6
— ANI (@ANI) January 12, 2024
ఇక తాజాగా అన్నపూరణి సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ భాజాపా ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh). అన్నపూరణి లాంటి సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్ సంస్థపై కూడా నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వివాదం గురించి ఆయన మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలు తీస్తే సహించేదిలేదు. ఈ సినిమా విషయంలో జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని తెలిసింది. కానీ.. సారీ చెప్పినంత మాత్రాన ఈ సమస్య ముగిసినట్టు కాదు. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్ సంస్థపై పూర్తి నిషేధం విధించాలి. అంతేకాదు.. ఇలాంటి సినిమాలు తీసే దర్శకుడు, నిర్మాతలు, నటీనటులపై కూడా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరుకుంటున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు రాజాసింగ్.