ప్రభుత్వ ఎస్కార్ట్ తో రీల్స్.. డిప్యూటీ సీఎం కొడుకుపై నెటిజన్ల ఆగ్రహం..

ప్రభుత్వ ఎస్కార్ట్ తో రీల్స్.. డిప్యూటీ సీఎం కొడుకుపై నెటిజన్ల ఆగ్రహం..

రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ బైర్వా కొడుకుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వ ఎస్కార్ట్ తో రీల్స్ చేయటం వివాదాస్పదం అయ్యింది. మాడిఫైడ్ జీప్ లో తన స్నేహితులతో కలిసి బైర్వా కుమారుడు ప్రభుత్వ ఎస్కార్ట్ తో వెళ్తూ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ విలాసాల కోసం ప్రభుత్వ ఎస్కార్ట్ ను వాడుకుంటున్నారంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. మొదట తన కుమారుడిని వెనకేసుకొచ్చిన ప్రేమ్ చంద్ తర్వాత మీడియాలో వరుస కథనాలు రావటంతో వివరణ ఇచ్చారు.

తన కుమారుడు మైనర్ అని, భద్రతా కారణాల దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఎస్కార్ట్ ను వాడుకున్నారని.. ఇందులో రూల్స్ అతిక్రమించలేదంటూ వెనకేసుకొచ్చిన ప్రేమ్ చంద్ ఎట్టకేలకు తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్నానని, ఈ విషయంపై తన కుమారుడిని మందలించానని అన్నారు.

ఈ ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత విషయాల వల్ల పార్టీకి నష్టం జరగటం తనకు ఇష్టంలేదని అన్నారు బైర్వా. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపారు.