
- జాయిన్ అయిన రాజస్థాన్కు చెందిన గౌరీ
- అభినందించిన మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: ములుగులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆలిండియాలో 23272వ ర్యాంక్ సాధించిన రాజస్థాన్ గంగానగర్ జిల్లాకు చెందిన విద్యార్థిని గౌరీ మొదటి అడ్మిషన్ తీసుకుంది. బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలోని ప్రిన్సిపల్ డాక్టర్ బి.మోహన్ లాల్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్మొదటి అడ్మిషన్ పొందిన గౌరీని అభినందించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొత్తం 50సీట్లు ఉండగా, ఆలిండియా ర్యాంక్ సాధించిన వారితో ఏడు సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 43సీట్లను తెలంగాణకు చెందిన విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ మోహన్లాల్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్రవంతి ప్రైవేట్ ఆస్పత్రిని మంత్రి సీతక్క ప్రారంభించారు.