15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఏఈ

15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఏఈ

రంగారెడ్డి జిల్లా  రాజేంద్రనగర్ సర్కిల్ మున్సిపల్  కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ బల్వంత్ రెడ్డిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.  సీసీ రోడ్డు నిర్మాణం పనుల విషయంలో AE బల్వంత్ రెడ్డి 24 వేలు రూపాయల లంచం డిమాండ్  చేశారు.  దీంతో సివిల్ కాంట్రాక్టర్  ఏసీబీ అధికారులను సంప్రదించాడు.  పక్కా ప్రణాళికతో  15 వేలు  లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా బల్వంత్ రెడ్డిని  ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

బల్వంత్ రెడ్డి బండ్లగూడ జాగర్ కార్పొరేషన్  లోని బండ్లగూడలో నివాసం ఉంటున్నాడు. లంచం తీసుకుంటూ పట్టుబడటంతో   బల్వంత్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు  చేస్తున్నారు.