తిరుపతి లడ్డు కాంట్రవర్సీ పై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఏమన్నాడంటే..?

తిరుపతి లడ్డు కాంట్రవర్సీ పై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఏమన్నాడంటే..?

గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ కాంట్రవర్సీ తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధిలో పంపినే చేసే లడ్డు ప్రసాదంలో జంతు మాసం నుంచి తీసిన క్రొవ్వు కలిపి తయారు చేసిన  నెయ్యిని ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కమిటీ వేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా ఇటీవలే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టైయాన్ చిత్ర ప్రమోషన్స్ కి వెళ్లొస్తుండగా ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ తిరుపతి లడ్డూ కల్తీ విషయంపై స్పందించమని అడిగాడు. దీంతో రజనీకాంత్ నో కామెంట్స్ అని, అలాగే ఇది చాలా సున్నితమైన అంశమని కాబట్టి ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదని చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 

ALSO READ | Laddu Row: మనకేం కావాలి.. పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్..

దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ లడ్డూ కల్తీ విషయంపై సినీ సెలబ్రెటీలు సైతం స్పందిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటించిన వెట్టాయాన్ అక్టోబర్ 10వ తారీఖున విడుదల కాబోతోంది. కాగా ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ మంజు వారియర్ హీరోయిన్ గా నటించగా అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, రితికా సింగ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించగా అనిరుద్ సంగీతం అందించారు.