OTT Telugu Family Drama: ఓటీటీలోకి వస్తున్న రాజీవ్ కనకాల హోం టౌన్ వెబ్ సిరీస్

OTT Telugu Family Drama: ఓటీటీలోకి వస్తున్న రాజీవ్ కనకాల హోం టౌన్ వెబ్ సిరీస్

రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘హోం టౌన్’.   ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో  ఈ వెబ్ సిరీస్‌‌ను  రూపొందించాడు దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి పల్లే.  నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించిన ఈ సిరీస్  ఏప్రిల్ 4 నుంచి ఆహా ఓటీటీలో  స్ట్రీమింగ్ కానుంది.  

ఈ కథ ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా ఉంటుందని,  ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల తనదైన పెర్ఫార్మెన్స్‌‌తో   ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారని మేకర్స్ చెప్పారు.  ఈ సిరీస్‌‌కు సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా దేవ్ దీప్ గాంధీ కుండు పనిచేయగా, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించాడు.